BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

పెద్దకాపర్తిలో టీబీ క్యాంప్ ప్రారంభించిన సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం NTODAY NEWS చిట్యాల

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
22 May, 2026 - 07:30 PM
232 వీక్షణలు

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత టీబీ  వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చిట్యాల మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం పిలుపునిచ్చారు. శుక్రవారం చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీబీ హెల్త్ క్యాంప్‌ను కాట వెంకటేశం అధికారికంగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ కాటం వెంకటేశం మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం సహకారంతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే సంకల్పంతో ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాణాంతకమైన టీబీ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ హెల్త్ క్యాంప్‌లో భాగంగా గ్రామానికి చెందిన సుమారు వంద మందికి టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో నలుగురికి టీబీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. బాధితులకు వెంటనే వైద్య సిబ్బంది సమక్షంలో అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొంగోని చెరువు సర్పంచ్ కట్ట ఆశయ, గ్రామ ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, హెల్త్ సిబ్బంది చిత్తలూరు శ్రీను, అండాలు, ఏఎన్ఎంలు, తదితరు పాల్గొన్నారు.