BREAKING
హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు ఘనంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు ఎండలో ఉపాధి కూలీలకు చల్లని ఊరట.. పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం.. లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు ఘనంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు ఎండలో ఉపాధి కూలీలకు చల్లని ఊరట.. పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం.. లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం
www.ntodaynews.com

పెద్దకాపర్తిలో టీబీ క్యాంప్ ప్రారంభించిన సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం NTODAY NEWS చిట్యాల

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
22 May, 2026 - 07:30 PM
8 వీక్షణలు

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత టీబీ  వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చిట్యాల మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం పిలుపునిచ్చారు. శుక్రవారం చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీబీ హెల్త్ క్యాంప్‌ను కాట వెంకటేశం అధికారికంగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ కాటం వెంకటేశం మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం సహకారంతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే సంకల్పంతో ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాణాంతకమైన టీబీ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ హెల్త్ క్యాంప్‌లో భాగంగా గ్రామానికి చెందిన సుమారు వంద మందికి టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో నలుగురికి టీబీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. బాధితులకు వెంటనే వైద్య సిబ్బంది సమక్షంలో అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొంగోని చెరువు సర్పంచ్ కట్ట ఆశయ, గ్రామ ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, హెల్త్ సిబ్బంది చిత్తలూరు శ్రీను, అండాలు, ఏఎన్ఎంలు, తదితరు పాల్గొన్నారు.