BREAKING
రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్.... మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్.... మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్
www.ntodaynews.com

పెనుగొలనులో ప్రజా గాయకుడు గద్దర్‌కు ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Aug, 2026 - 09:23 PM
39 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, పెనుగొలను, ఆగస్టు 6: పెనుగొలను గ్రామంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు, కవి, ప్రజా యుద్ధ నౌకగా పేరొందిన గద్దర్ మూడో వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో శిరిడి సాయిబాబా యూత్ కమిటీ అధ్యక్షుడు ఊటుకూరు యజ్ఞకృష్ణ మాట్లాడుతూ, గద్దర్ పేదలు, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు ఎదుర్కొనే కష్టనష్టాలను తన పాటల ద్వారా ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించి సామాజిక చైతన్యం తీసుకొచ్చారని అన్నారు.

"నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ", "బండెన్న బండిగట్టి", "అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా" వంటి గద్దర్ రచించిన పాటలు ప్రజల్లో విశేష ఆదరణ పొందాయని తెలిపారు. జీవిత చివరి దశలో తాను నమ్మిన కమ్యూనిజం, మావోయిజం భావజాలం నుంచి వైదొలిగి, అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని స్వీకరించిన మానవతావాదిగా గద్దర్ నిలిచారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అంగన్వాడీ చిన్నారులు, సిబ్బంది పాల్గొని గద్దర్‌కు ఘనంగా నివాళులర్పించారు.