BREAKING
​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్ సర్కార్‌తోనే పేదల సొంతింటి కల సాకారం ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్ సర్కార్‌తోనే పేదల సొంతింటి కల సాకారం
www.ntodaynews.com

పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
31 May, 2026 - 09:28 PM
6 వీక్షణలు

ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో జిల్లా ఎల్లప్పుడూ ఉత్తమ పనితీరుతో మెరుగైన స్థానంలో నిలవాలి

వెనుకబడిన పల్నాడు జిల్లాను కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమంలో అగ్రస్థానంలో నిలుపుదామని, జిల్లా ప్రగతే మనందరి ప్రధాన లక్ష్యం కావాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలన్నింటిలో పల్నాడు జిల్లా పనితీరు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.

సీనియర్ నాయకులు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఆదివారం రాత్రి జరిగిన జిల్లా అభివృద్ధి కార్యాచరణ సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ప్రత్తిపాటి పుల్లారావు తదితర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ‘సర్’ విధివిధానాలు, వైసీపీ దుష్ప్రచారం వంటి పలు అంశాలపై చర్చించారు. సీనియర్ నాయకుడిగా ప్రత్తిపాటి పుల్లారావు పలు సూచనలు, సలహాలు అందించారు.