BREAKING
చల్లని కబురు మరికొన్ని గంటల్లోనే అండమాన్‌కు నైరుతి రుతుపవనాలు లొంగిపోయిన బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత NTODAY NEWS చౌటుప్పల్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టరేట్ ముట్టడికి యత్నం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జెసిబి! 17 సంవత్సరాల బాలుడికి గాయాలు... డీలిమిటేషన్‌తో దక్షిణాదికి న్యాయం జరుగుతుందా..? మద్యం సేవించి ఘర్షణ పడి ఒకరి గాయాలు ! జూన్ నెలాఖరు లోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు చల్లని కబురు మరికొన్ని గంటల్లోనే అండమాన్‌కు నైరుతి రుతుపవనాలు లొంగిపోయిన బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత NTODAY NEWS చౌటుప్పల్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టరేట్ ముట్టడికి యత్నం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జెసిబి! 17 సంవత్సరాల బాలుడికి గాయాలు... డీలిమిటేషన్‌తో దక్షిణాదికి న్యాయం జరుగుతుందా..? మద్యం సేవించి ఘర్షణ పడి ఒకరి గాయాలు ! జూన్ నెలాఖరు లోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు
www.ntodaynews.com

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత NTODAY NEWS చౌటుప్పల్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
16 May, 2026 - 09:34 PM
148 వీక్షణలు

431 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్, మరో ఇద్దరు పరార్

రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ (ఆర్‌ఎన్‌పీఎస్) బృందం, చౌటుప్పల్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.పంతంగి టోల్‌ప్లాజా వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న TS07GM 4617 నంబర్‌ (నకిలీ నంబర్ ప్లేట్) గల మహీంద్రా ఎక్స్‌యూవీ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేసే సమయంలో అందులో ఉన్న నలుగురిలో ఇద్దరు అక్కడి నుంచి పారిపోగా, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో సుమారు 431 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 5 కిలోల చొప్పున 83 ప్యాకెట్లు, 2 కిలోల చొప్పున 8 ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల విచారణలో నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని, రాజమండ్రి ప్రాంతంలో రాకేష్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయిని సేకరించి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించినట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న నిందితులు సలీమ్ (34), అమన్ (22)గా గుర్తించారు. వీరు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా లిషాడి గ్రామానికి చెందినవారని తెలిపారు. కేసులో అమీర్ుద్దీన్, ఫిరోజ్ అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.
చౌటుప్పల్ పోలీసుల సమన్వయంతో ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.