www.ntodaynews.com
Pulse Polio: కొండమడుగులో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. చిన్నారులకు పోలియో చుక్కలు
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
బీబీ నగర్
కొండమడుగు | NTODAY NEWS
యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు గ్రామంలో 0–5 సంవత్సరాల లోపు చిన్నారులకు నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కడెం పాండురంగం ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సర్పంచ్ కడెం పాండురంగం మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పిల్లల ఆరోగ్య పరిరక్షణలో నిర్లక్ష్యం చేయరాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అరిగే శ్రీధర్, వాకిటి అనిత హరికృష్ణ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.