ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి
ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి: మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ నస్పూర్ కలెక్టరేట్లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ‘ఆఫ్టర్ కేర్’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 2వ తేదీ వరకు బాలల భద్రత, రక్షణ వారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపిన మేయర్, చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్ పిల్లలకు అవసరమైన ఆధార్, కుల, జనన ధ్రువీకరణ పత్రాలతో పాటు బ్యాంక్ ఖాతాలను అందజేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన పిల్లలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి దుర్గాప్రసాద్, మైనారిటీ సంక్షేమ అధికారి రాజేశ్వరి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు