BREAKING
ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి
www.ntodaynews.com

ప్రభుత్వ కార్యాలయాల ఫైల్ అన్ని ఈ-ఆఫీస్ ద్వారానే

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
01 Apr, 2026 - 06:02 PM
100 వీక్షణలు

ప్రభుత్వ కార్యాలయాల ఫైల్ అన్ని ఈ-ఆఫీస్ ద్వారానే--యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రభుత్వ కార్యకలాపాల ఫైలు ఆన్లైన్ లోనే వేగంగా ఫైళ్ళ పరిష్కారం చూపడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.బుధవారం రోజున కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అన్ని శాఖల జిల్లా అధికారులతో ఈ-ఆఫీస్ నిర్వహణ పై  సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిపాలనలో మరింత వేగం, పారదర్శకత, పర్యవేక్షణ పెంచేందుకు అన్ని ప్రభుత్వ శాఖల్లో కార్యకలాపాలు ఆన్లైన్లోనే జరగాలని జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు. ఏప్రిల్'01-2026 నుండి అన్ని శాఖల్లో ప్రతి ఫైలును ఆన్లైన్లోనే నిర్వహించాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి విభాగం నుండి సాధారణ పరిపాలన వరకు అన్ని ఈ-ఆఫీస్ ద్వారానే ఫైళ్ల పరిష్కారం జరుగుతాయని అన్నారు. ఈ ఆఫీస్ తో ప్రభుత్వ అధికారులకు సులభంగా పనులు జరుగుతాయని,అలాగే వేగంగా ఫైళ్ళ కదలిక పూర్తవడంతోపాటు పారదర్శకత ఉంటుందన్నారు. కలెక్టరేట్ లోని  ఏ.బి.సి.డి.ఈ,తదితర సెక్షన్ లోని అధికారులు సాధారణ పరిపాలనతో పాటు రెవెన్యూ, లా అండ్ ఆర్డర్, భూ సేకరణ, ప్రభుత్వ భూములు, కోర్టు కేసులు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ శాఖలో సంబంధిత ఉద్యోగుల పేరుతోనే (నేమ్ బెస్ట్ మెయిల్ ఐడి) క్రియేట్ అవుతుందన్నారు. మెయిల్ ఐడి తోనే అధికారుల అన్ని విధులు  ఆన్లైన్లో కొనసాగించాలన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు టోకెన్లు ఇవ్వడం జరిగిందని ఇకనుండి టోకెన్ల ద్వారానే ఈ సైన్ ద్వారానే ఫైళ్ళ పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. వీటితోపాటు జిల్లాలో ఆయా శాఖల పరిధిలో అభివృద్ధి, సంక్షేమ పరిపాలన విధులకు సంబంధించినవి ఆ శాఖ విభాగాధిపతి నుంచి జిల్లా కలెక్టర్  కు చేరుతాయన్నారు. ఈ ఫైలు అన్ని దాదాపు ఆన్లైన్లోనే కలెక్టర్ వద్దకు చేరుతాయని కలెక్టర్ ఆ ఫైలను పరిశీలించి తదుపరి చర్యలకై పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. భూభారతి, ప్రజా పాలన తదితర దరఖాస్తుల పరిష్కారం ఆన్లైన్ ద్వారానే నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సూచించారు. అనంతరం ఈ ఆఫీస్ నిర్వహణ పై అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ డిస్టిక్ మేనేజర్ వివరించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జయమ్మ, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఈ. డిస్టిక్ మేనేజర్ సాయి కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.