www.ntodaynews.com
ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ సదస్సును జయప్రదం చేయండి: సిఐటియు జిల్లా కార్యదర్శి పిలుపు
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల జిల్లా సిఐటియు కార్యాలయంలో శుక్రవారం నాడు "ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ" రాష్ట్ర సదస్సు పోస్టర్లను జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మే 17న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సదస్సుకు సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ కామ్రేడ్ ఎలమారం కరీం ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకై నిర్వహిస్తున్న ఈ సదస్సులో జిల్లాలోని పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మౌలాలి, నాయకులు శ్రీధర్, సుధాకర్ రెడ్డి, సంతోష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు