www.ntodaynews.com
ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ పాస్ కావాల్సిందే: సుప్రీంకోర్టు
జాతీయం
ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ పాస్ కావాల్సిందే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అర్హత సాధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై ఉపాధ్యాయ సంఘాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది.
అయితే, ఐదేళ్లకు పైగా సేవలో ఉన్న ఉపాధ్యాయులకు కొంత ఊరటనిస్తూ టెట్ అర్హత సాధించేందుకు ఇచ్చిన గడువును రెండేళ్ల నుంచి మూడేళ్లకు పొడిగించింది. దీంతో వారు 2028 ఆగస్టు 31లోగా టెట్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం ప్రాథమిక విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంపొందించేందుకు, అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.