www.ntodaynews.com
ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు
ప్రైవేట్ స్కూళ్లతో సమానంగా సర్కారు బడులు.. పెరుగుతున్న పిల్లల సంఖ్య
మంచిర్యాల నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన తన నివాసంలో మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సర్కారు బడుల్లో మౌలిక వసతులు పెంచడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు