BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

​ప్రధాని మోడీపై ఖర్గే వ్యాఖ్యలు అప్రజాస్వామికం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 06:16 PM
43 వీక్షణలు

​​ప్రధాని మోడీపై ఖర్గే వ్యాఖ్యలు అప్రజాస్వామికం: మంచిర్యాలలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం

మంచిర్యాల: భారత ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాల ఐబి చౌరస్తాలో బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి గర్మిళ్ల జోన్ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజు కుమార్ మాట్లాడుతూ, ప్రధానిని ఉగ్రవాదిగా సంబోధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మరియు దేశ ప్రజలను అవమానించడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకనే కాంగ్రెస్ నేతలు ఇటువంటి విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి నాయకులు కుర్రే చక్రవర్తి, నాగరాజు, పల్లి రాకేష్, కర్రే లచన్న, రెడ్డిమళ్ల అశోక్, మొరడికొండ శ్రీనివాస్, పచ్చ వేంకటేశ్వర్లు, రౌతు వెంకటేశం, మీనా సూరీ, కావేటి మనీష్, రవీందర్ యాదవ్, మణికంఠ, సాయి తదితరులు పాల్గొన్నారు