ప్రధాని మోడీపై ఖర్గే వ్యాఖ్యలు అప్రజాస్వామికం
ప్రధాని మోడీపై ఖర్గే వ్యాఖ్యలు అప్రజాస్వామికం: మంచిర్యాలలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం
మంచిర్యాల: భారత ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాల ఐబి చౌరస్తాలో బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి గర్మిళ్ల జోన్ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజు కుమార్ మాట్లాడుతూ, ప్రధానిని ఉగ్రవాదిగా సంబోధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మరియు దేశ ప్రజలను అవమానించడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకనే కాంగ్రెస్ నేతలు ఇటువంటి విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి నాయకులు కుర్రే చక్రవర్తి, నాగరాజు, పల్లి రాకేష్, కర్రే లచన్న, రెడ్డిమళ్ల అశోక్, మొరడికొండ శ్రీనివాస్, పచ్చ వేంకటేశ్వర్లు, రౌతు వెంకటేశం, మీనా సూరీ, కావేటి మనీష్, రవీందర్ యాదవ్, మణికంఠ, సాయి తదితరులు పాల్గొన్నారు