BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

పరీక్ష నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
18 Mar, 2026 - 10:13 AM
161 వీక్షణలు

పరీక్ష నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దు --యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

జిల్లాలో పదవతరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.బుధవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో పదవతరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.విద్యార్థుల హాజరు,గైర్హాజరు వివరాలను సంబంధిత పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటిండెంట్లను అడిగి తెలుసుకున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు ఏర్పాటు చేయాలన్నారు.విద్యార్థులను ప్రధాన గేట్ వద్ద పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాత పరీక్ష కేంద్రంలోకి పంపించాలనిచెప్పారు.ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాల డిపాజిట్ ను పోలీస్ భద్రతతో  డిపాజిట్ చేయాలని ఆదేశించారు.పరీక్ష కేంద్రాలవద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని,పరీక్ష కేంద్రంలోకి ఇతర వ్యక్తులను వెళ్లకుండా చూడాలని అన్నారు.పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల జీరాక్స్ కేంద్రాలు మూసివేసేలా చూసుకోవాలన్నారు.జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగరాదని,పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని చెప్పారు.ఈ కార్యక్రమం లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.