BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 87 ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:39 PM
111 వీక్షణలు

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 87 ఫిర్యాదులు

విజయవాడ, మార్చి 23: ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో 87 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఇన్‌చార్జ్ పోలీస్ కమిషనర్ సర్వ శ్రేష్ఠ త్రిపాటి, ఐపీఎస్ ఆదేశాల మేరకు డీసీపీ ఎ.బి.టి.ఎస్. ఉదయారాణి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు, వారితో నేరుగా మాట్లాడి సమస్యలపై అవగాహన పొందారు. భూ, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించినవి అత్యధికంగా నమోదయ్యాయి. మహిళా సంబంధిత కేసులు, కుటుంబ కలహాలు, మోసాలు, దొంగతనాలు, కొట్లాటలు వంటి వివిధ అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి.

ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులకు సూచనలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.