ప్రజా సమస్యలను విస్మరిస్తే ఊరుకోం : బీఎస్పీ ధ్వజం
NTODAY NEWS
నకిరేకల్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యే ఒకరినొకరు విమర్శించుకోవడానికే సమయం కేటాయిస్తున్నారు తప్ప, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నకిరేకల్ పరిధిలోని శకుంతల గార్డెన్లో బీఎస్పీ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగం, రైతులకు గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరల నియంత్రణ, తాగు-సాగు నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ స్థానంలో గెలిచి మహనీయుల ఆశయాలకు భంగం కలిగించడం బాధాకరమన్నారు. రాబోయే రోజుల్లో బూత్, సెక్టార్, మండల స్థాయిల్లో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో బీఎస్పీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జ్ కత్తుల కాన్షీరామ్, నియోజకవర్గ ఇన్చార్జ్ చెట్టుపల్లి కాశిరాం, నియోజకవర్గ అధ్యక్షులు గ్యారా శేఖర్, కార్యదర్శి బుర్రు శంకర్, చిట్యాల పట్టణ అధ్యక్షులు హౌ రెడ్డి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.