BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

ప్రజా సమస్యలను విస్మరిస్తే ఊరుకోం : బీఎస్పీ ధ్వజం

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
22 May, 2026 - 06:59 PM
97 వీక్షణలు

NTODAY NEWS 

నకిరేకల్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యే ఒకరినొకరు విమర్శించుకోవడానికే సమయం కేటాయిస్తున్నారు తప్ప, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని బహుజన సమాజ్ పార్టీ  నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నకిరేకల్ పరిధిలోని శకుంతల గార్డెన్‌లో బీఎస్పీ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగం, రైతులకు గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరల నియంత్రణ, తాగు-సాగు నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ స్థానంలో గెలిచి మహనీయుల ఆశయాలకు భంగం కలిగించడం బాధాకరమన్నారు. రాబోయే రోజుల్లో బూత్, సెక్టార్, మండల స్థాయిల్లో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ​ఈ సమావేశంలో బీఎస్పీ భువనగిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్ కత్తుల కాన్షీరామ్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెట్టుపల్లి కాశిరాం, నియోజకవర్గ అధ్యక్షులు గ్యారా శేఖర్, కార్యదర్శి బుర్రు శంకర్, చిట్యాల పట్టణ అధ్యక్షులు హౌ రెడ్డి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.