BREAKING
ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి
www.ntodaynews.com

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలి

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
17 Mar, 2026 - 06:20 AM
125 వీక్షణలు

కరీంనగర్: ప్రజావాణికి వచ్చే అర్జీల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడేతో కలిసి ఆమె ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుండి ఆశతో వచ్చే బాధితులకు అధికారులు అండగా నిలవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలను ఓపికగా విన్న కలెక్టర్, వెంటనే పరిష్కారమయ్యే అంశాలపై అక్కడికక్కడే అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వృద్ధులు, దివ్యాంగుల చెంతకే కలెక్టర్:

మానవీయ కోణంలో ఆలోచిస్తూ, కలెక్టర్ చిత్రా మిశ్రా స్వయంగా వృద్ధులు మరియు దివ్యాంగుల వద్దకు వెళ్లి దరఖాస్తులను స్వీకరించడం అందరినీ ఆకట్టుకుంది. నేటి ప్రజావాణిలో వివిధ సమస్యలపై మొత్తం 290 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, హుజురాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.