BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలి

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
17 Mar, 2026 - 06:20 AM
188 వీక్షణలు

కరీంనగర్: ప్రజావాణికి వచ్చే అర్జీల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడేతో కలిసి ఆమె ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుండి ఆశతో వచ్చే బాధితులకు అధికారులు అండగా నిలవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలను ఓపికగా విన్న కలెక్టర్, వెంటనే పరిష్కారమయ్యే అంశాలపై అక్కడికక్కడే అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వృద్ధులు, దివ్యాంగుల చెంతకే కలెక్టర్:

మానవీయ కోణంలో ఆలోచిస్తూ, కలెక్టర్ చిత్రా మిశ్రా స్వయంగా వృద్ధులు మరియు దివ్యాంగుల వద్దకు వెళ్లి దరఖాస్తులను స్వీకరించడం అందరినీ ఆకట్టుకుంది. నేటి ప్రజావాణిలో వివిధ సమస్యలపై మొత్తం 290 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, హుజురాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.