ప్రజలకు తాగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలి --జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు
గ్రామపంచాయతీ పరిధిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు చౌటుప్పల్ మండల పరిధిలోని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న త్రాగునీరు, SW లింగోటం 70 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ట్రాన్స్ఫార్మర్ యార్డ్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా 14వ తేదీ ఉదయం 5:00 గంటల నుండి నిలిచిపోయిన విషయం పై అదనపు కలెక్టర్ శుక్రవారం చౌటుప్పల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజలకు తగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ గ్రామ పరిధిలో ఉన్న స్థానిక బోర్వెల్లులను గుర్తించి ప్రత్యామ్నాయ త్రాగునీటి సరఫరా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా కూడా నీటి సరఫరా చేపట్టాలని ఆదేశించారు.మిషన్ భగీరథ నీటి సరఫరా పునరుద్ధరణ వరకు ప్రజలకు త్రాగునీటి కొరత తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.ఈ సమావేశంలో ఆర్డీవో శేఖర్ రెడ్డి , మండల స్పెషల్ ఆఫీసర్ రవీందర్ , ఎంపీడీవో సందీప్ కుమార్, Dy.EE, AEE మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు