www.ntodaynews.com
ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టిబాబు మరణం
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు, రాజకీయ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు (71) కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు కొండాపూర్ పరిధిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ త్రిపురనేని చిట్టిబాబు తుదిశ్వాస విడిచారు. ఆయన గుండె పోటుతో మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు.
అల్లూరి సీతారామరాజు చిత్రానికి రచయితగా, ప్రముఖ నిర్మాత త్రిపురనేని మహారథి కుమారుడైన చిట్టిబాబు, తన వ్యక్తిత్వంతో సినిమా పరిశ్రమలో మరియు రాజకీయ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు.
చిట్టిబాబు మృతికి సినీ పరిశ్రమ, రాజకీయ వర్గాల నుండి సంతాపం వెల్లువెత్తుతోంది.