మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు
ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన మామిడి రకమైన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు
యాదాద్రి భువనగిరి జిల్లాలో మామిడి పన్నెండు వేల ఎకరాలలో సాగవుతున్నది. ముఖ్యంగా బంగినపల్లి,కేసర్ దశేరి, హిమాయత్, చిన్న రసాలు, పెద్ద రసాలు సాగులో ఉన్నవి. జిల్లాలో ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో రైతు ఎగ్గిడి లక్ష్మణ్ వ్యవసాయ క్షేత్రంలో ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన మామిడి రకమైన మియాజాకి సాగు చేయడం జరిగింది దాదాపుగా 20 చెట్లను 2023 వ సంవత్సరంలో నాటడం జరిగింది.ఈ సంవత్సరం రైతు కి మొదటి పంట రావడం తో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి బహుకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారిని శ్రీమతి మాధవి, ఆలేరు క్లస్టర్ ఉద్యాన అధికారిని స్రవంతి,చౌటుప్పల్ క్లస్టర్ ఉద్యాన అధికారిని కవిత,ఉద్యాన అధికారిని టెక్నికల్ స్నేహిత పాల్గొనడం జరిగింది.