5వ తరగతి విద్యార్థికి సైకిల్ బహుమతి
ప్రతిభకు ప్రోత్సాహం: 5 వ తరగతి విద్యార్థికి సైకిల్ బహుమతి
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం నాడు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గత విద్యా సంవత్సరం (2025-26) లో 5వ తరగతి పూర్తి చేసి, పాఠశాల స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన డి. అభిజ్ఞాన హర్షవర్ధన్ అనే విద్యార్థికి అతని ప్రతిభను గుర్తిస్తూ సైకిల్ను బహుమతిగా అందజేశారు దివంగత శ్రీమతి సమ్మక్క, బక్కారెడ్డి జంగమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ సమ్మక్క నర్సిరెడ్డి మరియు సమ్మక్క రంగారెడ్డి ఈ సైకిల్ను విరాళం అందించారు గ్రామ సర్పంచ్ మరియు పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచేందుకు ఇటువంటి ప్రోత్సాహకాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థికి సైకిల్ అందించిన దాతలకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ పాలెం మహేష్, జిహెచ్ఎం ఏపూర్ బండ మోహన్ రెడ్డి, ఎంపీపీ ఎంపీపీఎస్ ఏపూర్ ప్రధానోపాధ్యాయులు అంజయ్య మరియు ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.