www.ntodaynews.com
పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
చిలకలూరిపేట మండల పరిధిలోని పసుమర్రు సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ఎర్టికా కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పొలాల కాలువలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం గుంటూరు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో బాల్టి ప్రదీప్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదానికి గురైన యువకులంతా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం త్రిపురారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా బాపట్ల జిల్లా చీరాల బీచ్కు వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.