BREAKING
రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్.... మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్.... మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్
www.ntodaynews.com

పుట్టినరోజు వేళ గురుకుల విద్యార్థినిని బయటకు పంపించారంటూ ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Aug, 2026 - 11:12 PM
20 వీక్షణలు

ద్వారకాతిరుమల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ తీరుపై తల్లి ఆవేదన.. విచారణ చేపట్టాలని స్థానికుల డిమాండ్

ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల, ఆగస్టు 6: ద్వారకాతిరుమలలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థినికి సంబంధించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు పాఠశాలకు వచ్చిన తల్లి, కుటుంబ సభ్యులను లోపలికి అనుమతించలేదని వారు ఆరోపించారు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, పుట్టినరోజు సందర్భంగా కేక్, కొత్త బట్టలు తీసుకుని పాఠశాలకు వచ్చినప్పటికీ ప్రిన్సిపాల్ వారిని గేటు దాటనివ్వలేదని తెలిపారు. దీంతో వారు రోజంతా పాఠశాల గేటు వద్దే వేచి ఉన్నారని చెప్పారు.

సాయంత్రం సమయంలో విద్యార్థినిని పాఠశాల నుంచి బయటకు పంపించారని, అనంతరం స్వగ్రామమైన చింతలపూడికి వెళ్లేందుకు ద్వారకాతిరుమల బస్టాండ్‌కు చేరుకున్నప్పటికీ వెంటనే బస్సు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.

పుట్టినరోజు కోసం తీసుకొచ్చిన కేక్, కొత్త బట్టలు చూపిస్తూ విద్యార్థిని తల్లి కన్నీటి పర్యంతమై తన కుమార్తెతో ఇలా వ్యవహరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత ప్రిన్సిపాల్‌పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను కోరారు.

ఈ ఘటనను గమనించిన బస్టాండ్‌లోని పలువురు స్థానికులు కూడా విషయాన్ని సమగ్రంగా విచారించి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.