BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

భూభారతి చట్టం ద్వారా భూ శాశ్వత పరిష్కారం

తెలంగాణ
12 Jun, 2025 - 08:00 AM
168 వీక్షణలు
భూభారతి చట్టం ద్వారా భూ శాశ్వత పరిష్కారం--యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి NTODAY NEWS: బొమ్మలరామారం, జూన్ 12 భూ సమస్యలు ఉన్నవారు గ్రామ రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకుంటే భూ భారతి చట్టం ద్వారా భూ శాశ్వత పరిష్కారం అవుతుందని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. గురువారం రోజున రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో బొమ్మలరామారం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ధరణి ద్వారా కానీ భూ సమస్యలకు ప్రభుత్వం కొత్తగా భూభారతి (ఆర్ ఓ ఆర్ చట్టం) అమలులో భాగంగా రెవిన్యూ అధికారులే మీ గ్రామానికి వచ్చి భూ సమస్యలు పరిష్కరిస్తారు.గ్రామంలోని రైతులను వారి భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తమ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ మార్పులు చేర్పులు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మీ గ్రామంలోనే మీ ఇంటి దగ్గరకే వచ్చి రెవెన్యూ అధికారులు సమస్య పరిష్కరిస్తారన్నారు. భూ భారతి లో దరఖాస్తు పెట్టుకుంటే ,రైతులు అర్జీతోపాటు పాస్ పుస్తకం,సమస్యలకు సంబంధించిన ఆధారాలను అధికారులకు అందజేయాలని,అందజేసిన రోజే రెవెన్యూ అధికారులు మీ గ్రామంలోనే పరిశీలించి ,కోర్టు పరిధిలో ఉన్న ఆర్జీల మినహా మిగతా వాటిని పరిష్కరిస్తారన్నారు. సమస్య యొక్క దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తారన్నారు. తీసుకున్న అర్జీలను అదే రోజు గ్రామంలో పరిశీలించి అవసరం అయితే క్షేత్రస్థాయిలో విచారిస్తారన్నారు. భూ భారతి సేవలు గ్రామంలో రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామ రెవెన్యూ సదస్సులలో తాసిల్దార్ పి శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ శోభారాణి, ఏ ఆర్ ఐ నరేష్ నాయక్, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube