BREAKING
గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం
www.ntodaynews.com

ఫుడ్ ఇన్స్పెక్టర్ పేరుతో మోసం.. డబ్బులు డిమాండ్ చేస్తూ పట్టుబడ్డ వ్యక్తి

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 06:48 AM
20 వీక్షణలు

అనంతపురం: నగరంలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్‌గా నటిస్తూ ఓ వ్యక్తి హల్చల్ చేసిన ఘటన కలకలం రేపింది. ఎస్పీ కార్యాలయానికి సమీపంలో, డీఎస్పీ కార్యాలయం పక్కన ఉన్న ఓ కిరాణా దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అనిల్ కుమార్ అనే వ్యక్తి తనను ఫుడ్ ఇన్స్పెక్టర్‌గా పరిచయం చేసుకుని, దుకాణంలో సిగరెట్లు విక్రయిస్తున్నారని పేర్కొంటూ దుకాణదారుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఫైన్ చెల్లించాలంటూ డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన డీఎస్పీ కార్యాలయ కానిస్టేబుల్ ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో అనిల్ కుమార్ ఈగల్ ఐ సెక్యూరిటీ సర్వీస్ ఏజెన్సీలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు తేలింది.

ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులకు చిక్కిన అనంతరం తనను విడిచిపెట్టాలని, తనకు పిల్లలు ఉన్నారని వేడుకున్నట్లు సమాచారం.

చివరకు నిందితుడు అనిల్ కుమార్‌ను డీఎస్పీ కార్యాలయ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.