BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

ఫుడ్ ఇన్స్పెక్టర్ పేరుతో మోసం.. డబ్బులు డిమాండ్ చేస్తూ పట్టుబడ్డ వ్యక్తి

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 06:48 AM
66 వీక్షణలు

అనంతపురం: నగరంలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్‌గా నటిస్తూ ఓ వ్యక్తి హల్చల్ చేసిన ఘటన కలకలం రేపింది. ఎస్పీ కార్యాలయానికి సమీపంలో, డీఎస్పీ కార్యాలయం పక్కన ఉన్న ఓ కిరాణా దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అనిల్ కుమార్ అనే వ్యక్తి తనను ఫుడ్ ఇన్స్పెక్టర్‌గా పరిచయం చేసుకుని, దుకాణంలో సిగరెట్లు విక్రయిస్తున్నారని పేర్కొంటూ దుకాణదారుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఫైన్ చెల్లించాలంటూ డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన డీఎస్పీ కార్యాలయ కానిస్టేబుల్ ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో అనిల్ కుమార్ ఈగల్ ఐ సెక్యూరిటీ సర్వీస్ ఏజెన్సీలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు తేలింది.

ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులకు చిక్కిన అనంతరం తనను విడిచిపెట్టాలని, తనకు పిల్లలు ఉన్నారని వేడుకున్నట్లు సమాచారం.

చివరకు నిందితుడు అనిల్ కుమార్‌ను డీఎస్పీ కార్యాలయ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.