www.ntodaynews.com
గంజాయిని తరలిస్తున్న ఆటోను పట్టుకున్న బీబీనగర్ పోలీసులు
తెలంగాణ
గంజాయిని తరలిస్తున్న ఆటోను పట్టుకున్న బీబీనగర్ పోలీసులు
NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద.భాస్కర్ కురుమ
CI ప్రభాకర్ రెడ్డీ తెలిపిన వివరాలు ప్రకారం
శుక్రవారం ఉదయం పెట్రోలింగ్ కు వెళుతున్న బీబీనగర్ పోలీస్ వారికి కొండమడుగు మెట్టు సర్వీస్ రోడ్డు వెంట అనుమనస్పదంగా ఆగి ఉన్న ఆటో లోని నలుగురు వ్యక్తులు ను విచారించగా వారి పేర్లు 1. భూక్యా ఆజాద్ నాయక్, తండ్రి: రామచంద్రు, వ: 22 సం.లు, వృత్తి: డిగ్రీ స్టూడెంట్, నివాసం బొడుప్పల్, హైదరాబాద్, 2. వల్లెపు వంశీ, తండ్రి:వెంకటేశ్వర్లు, వ: 26 సంలు, కులంవృత్తి: మేస్రీ, నివాసం: రావినారాయణ కాలనీ, కుంట్లూరు, హయత్ నగర్, హైదరాబాద్, 3. మేకల స్టాలిన్, తండ్రి: ఆంజనేయులు, వ: 20 సంలు, వృత్తి: లేబర్ వర్క్స్ నవత ట్రాన్స్ పోర్ట్, నివాసం: రావినారాయణ కాలనీ, కుంట్లూరు, హయత్ నగర్, హైదరాబాద్, 4. బుడ్డ సునీల్, తండ్రి: బిక్షపతి, వ: 21 సంలు, వృత్తి: డిగ్రీ సెకండ్ఇయర్ & రాపిడో ఆటో సర్వీస్, నివాసం: రావినారాయణ కాలనీ, కుంట్లూరు, హయత్ నగర్, హైదరాబాద్ అని తెలిపి వారు ఛత్తీస్ ఘడ్ నుండి తెచ్చుకున్న గంజాయి ని తాగడానికి మరియు ఎవరికైనా కావాలి అంటే అమ్మడానికి ఇక్కడికి వచ్చినాము అని తెలిపి, వారి వెంట తెచ్చిన గంజాయి 1.394 గ్రాములు ఇదే అని చూపించగా, పోలీస్ వారు అట్టి గంజాయిని, వారి యొక్క ఆటో TS11T1817 మరియు వారి యొక్క 3 సెల్ ఫోన్ లను సీజ్ చేసి చట్టరీత్యా చర్య నిమిత్తం కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కు తరలించారు. ఈ ఆపరేషన్ లో ఎస్ ఐ యన్ రమేష్, యస్ ఐ 2 అమర్ సింగ్, వారి సిబ్బంది ఎన్.అరవింద్ కుమార్, HC 3669, బి అంజయ్య hc 4510, పి శ్రీనివాస్ pc 4156, ఏ అర్జున్ pc 13165 పాల్గొన్నారని బీబీనగర్ SHO యం ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube