BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

చీపురుగూడెంలో మాజీ నీటి సంఘం అధ్యక్షుడు మందలపు ప్రసాద్‌కు పరామర్శలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Jul, 2026 - 08:58 PM
63 వీక్షణలు

చాట్రాయి, జూలై 31: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామానికి చెందిన మాజీ నీటి సంఘం అధ్యక్షుడు, "ఉత్తమ నీటి సంఘం" నాయకుడిగా అవార్డు అందుకున్న మందలపు ప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో ఇంటి వద్దే చికిత్స పొందుతున్నట్లు తెలిసి డి. హరినాథ్, డి. పుల్లారావు శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా కోటపాడులో ఐపీఎఫ్–సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో జరిగిన చారిత్రాత్మక రైతాంగ ఉద్యమంలో కలిసి పనిచేసిన రోజుల జ్ఞాపకాలను ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. తన కుమారుడు జగదీష్‌కు హరినాథ్‌ను పరిచయం చేస్తూ ఆనాటి ఉద్యమ విశేషాలను కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. అదే సమయంలో హరినాథ్ ఆరోగ్యం గురించి ఆరా తీసి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మందలపు ప్రసాద్ క్యాన్సర్‌తో కూడా బాధపడుతున్నట్లు తెలిసింది. ఇటీవలే ఆయన భార్య మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. జీవితాంతం వ్యవసాయానికే అంకితమైన రైతు ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో పరామర్శకు వచ్చిన వారిని ఆ దృశ్యం కలచివేసింది.

మందలపు ప్రసాద్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ బంధువులు, స్నేహితులు, రైతు సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు వరుసగా ఆయనను పరామర్శిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు.