చీపురుగూడెంలో మాజీ నీటి సంఘం అధ్యక్షుడు మందలపు ప్రసాద్కు పరామర్శలు
చాట్రాయి, జూలై 31: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామానికి చెందిన మాజీ నీటి సంఘం అధ్యక్షుడు, "ఉత్తమ నీటి సంఘం" నాయకుడిగా అవార్డు అందుకున్న మందలపు ప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో ఇంటి వద్దే చికిత్స పొందుతున్నట్లు తెలిసి డి. హరినాథ్, డి. పుల్లారావు శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా కోటపాడులో ఐపీఎఫ్–సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో జరిగిన చారిత్రాత్మక రైతాంగ ఉద్యమంలో కలిసి పనిచేసిన రోజుల జ్ఞాపకాలను ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. తన కుమారుడు జగదీష్కు హరినాథ్ను పరిచయం చేస్తూ ఆనాటి ఉద్యమ విశేషాలను కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. అదే సమయంలో హరినాథ్ ఆరోగ్యం గురించి ఆరా తీసి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మందలపు ప్రసాద్ క్యాన్సర్తో కూడా బాధపడుతున్నట్లు తెలిసింది. ఇటీవలే ఆయన భార్య మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. జీవితాంతం వ్యవసాయానికే అంకితమైన రైతు ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో పరామర్శకు వచ్చిన వారిని ఆ దృశ్యం కలచివేసింది.
మందలపు ప్రసాద్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ బంధువులు, స్నేహితులు, రైతు సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు వరుసగా ఆయనను పరామర్శిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు.