సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
NTODAY NEWS: సైదాబాద్
సిఐటియు హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు.తెలంగాణ రాష్ట్ర 5వ మహా సభలు విజయవంతం చేయాలనీ పోస్టర్ విడుదల ఐ ఎస్ సధన్ సంతోష్ నగర్ దగ్గర విడుదలచేశారు. ఈ కార్యక్రమం సందర్బంగా సిఐటియు. జిల్లా కార్యదర్శి ఎం. శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నిరంతరం సమారాశిలా పోరాటం చేస్తున్న సంఘం సిఐటియు.అట్టి సిఐటియు. రాష్ట్ర మహాసభలు మెదక్ పట్టణం లో డిసెంబర్ 7నుండి 9వరకు మూడు రోజుల పాటు జరుగబోతున్నాయి. గత మూడు సంవత్సరాలలో చేసిన ఉద్యమాలు, పోరాటాలను సమీక్షా చేసుకొని భవిష్యత్ లో కేంద్ర బిజెపి. ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు త్రిప్పి కొట్టడానికి ప్రణాళిక చేయ బోతున్నాము. అదే విధంగా కార్మికులకు కనీస వేతనము రు. 26000/-, 4లేబర్ కోర్డ్ ఉపసంహారణకై పోరాటం ఎలా చేయాలి అనే అంశం చర్చించడం జరుగుతుంది. కావున ఈ మహాసభలలో మున్సిపల్ కార్మికులు, భవన నిర్మాణం కార్మికులు, అంగన్వాడీ, ఆశా, ఆటో డ్రైవర్సులు, కాంట్రాక్టు కార్మికులు, గిగ్ వర్కర్స్ లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మినా, ఎస్. కిషన్, నారాయణ, జీ. యాదమ్మా, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube