BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

టీటీడీ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ

తెలంగాణ
13 Feb, 2026 - 08:12 AM
266 వీక్షణలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు: తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ NTODAY NEWS: శ్రీశైలం / నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరఫున శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో టిటిడి ఉప కార్యనిర్వహణాధికారి ఎం. లోకనాథం దంపతులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, వేదపండితులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అనంతరం పట్టు వస్త్రాలకు పూజలు నిర్వహించారు. పూజల అనంతరం మేళతాళాల నడుమ ఆలయ ప్రవేశం చేసి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా టిటిడి ప్రతినిధులు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ పవిత్ర ఉత్సవాల్లో పాల్గొనడం తమకు ఆనందదాయకమని పేర్కొన్నారు. #Srisailam #Mahashivaratri2026 #TTD #SilkVastram #TempleTraditions #AndhraPradeshTemples Follow us on Website Facebook Instagram YouTube