BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం

తెలంగాణ
14 Jan, 2026 - 09:15 AM
334 వీక్షణలు

ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం

కేటీఆర్ విమర్శలు అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: జగిత్యాల జిల్లా, ధర్మపురి ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేస్తున్న విమర్శలు ప్రజల దృష్టిని మళ్లించే అటెన్షన్ డైవర్షన్ డ్రామాలేనని తీవ్రంగా విమర్శించారు. పాలనలో విఫలమై ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అబద్ధాల రాజకీయాలకు దిగుతున్నారని మండిపడ్డారు. కృష్ణ జలాల అంశంలో ప్రజలను కావాలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, గతంలో ఈ అంశంపై చర్చకు వస్తే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి పారిపోయిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. కృష్ణ–గోదావరి జలాల వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యతతో, చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర సంపదను దోచుకున్న పాపాల ఫలితంగా నేడు రాష్ట్రం భారీ ఆర్థిక భారాన్ని మోస్తోందని అన్నారు. దోపిడీ పాలనకు అలవాటు పడిన బీఆర్ఎస్‌కు ప్రజా ప్రభుత్వం జవాబుదారీ పాలన అంటే ఏమిటో చూపిస్తోందని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లోనే బీఆర్ఎస్‌కు ప్రజలు గట్టి తీర్పు చెప్పారని, ఇది కేవలం ఆరంభమేనని హెచ్చరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ప్రజలు పూర్తిగా తిరస్కరించబోతున్నారని స్పష్టం చేశారు. కేటీఆర్ చేస్తున్న విమర్శలు వాస్తవాలకు దూరమైనవని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలే తప్ప మరొకటి కాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తేల్చిచెప్పారు. #AdluriLaxmanKumar #Dharmapuri #CongressGovernment #KTR #BRS #TelanganaPolitics #PressMeet #PublicAccountability Follow us on Website Facebook Instagram YouTube