BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

తాగునీటి సమస్య నివారణకు ముందస్తు చర్యలు

తెలంగాణ
02 Mar, 2026 - 07:14 AM
94 వీక్షణలు
వేసవిలో తాగునీటి సమస్య నివారణకు ముందస్తు చర్యలు NTODAY NEWS: చిట్యాల, నల్గొండ జిల్లా రానున్న వేసవిలో తాగునీటి కొరత తలెత్తకుండా చిన్న కాపర్తి గ్రామ పంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇంటింటికీ సాగర్ నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో గ్రామ సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన పైప్‌లైన్‌లను మరమ్మతు చేయించడంతో పాటు మొత్తం ఐదు గేట్‌వాల్వులను ఏర్పాటు చేసి శుక్రవారం ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న ప్రధాన పైప్‌లైన్‌ను సరిచేశారు. అదేవిధంగా 8వ వార్డులో రెండు గేట్‌వాల్వులు, 9వ వార్డులో ఒక గేట్‌వాల్వును నూతనంగా అమర్చారు. ఈ చర్యలతో నీటి సరఫరా మరింత సక్రమంగా జరుగుతుందని సర్పంచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవి కాలంలో గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూడడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు రుద్రారపు లక్ష్మణ్, రొండి నర్సింహా, పల్లపు పరమేశ్వరి ప్రశాంత్, ఈరమళ్ళ దయాకర్, వలిగొండ కవిత సత్యనారాయణ, దేశాపాక మధు, పెర్కా నాగరాజు, మాజీ సర్పంచ్ వలిగొండ సోమయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు నందిపటి మహేష్, సామాజిక కార్యకర్త పొలిమేర దశరథ తదితరులు పాల్గొన్నారు. #WaterManagement #SummerPreparedness #Chityal #NalgondaDistrict #DrinkingWater #VillageDevelopment Follow us on Website Facebook Instagram YouTube