www.ntodaynews.com
సమస్యా పరిష్కారమే జనసేన జనవాణి
తెలంగాణ
సమస్యా పరిష్కారమే జనసేన జనవాణి
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు ఈ వారం జరిగిన జనవాణి కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఇన్చార్జ్ సిరివేలు చిన్నా రాయల్ ఆదేశాల మేరకు పలు సమస్యలు పరిష్కరించబడాయి.
ముఖ్యంగా పుంగమ్మ చెరువు కట్ట వద్ద ఉన్న శనేశ్వరుని గుడి సమీపంలో రోడ్డు గుంతలు ఎక్కువగా ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి కొంత నిధులు కేటాయించి రోడ్డు మరమ్మతులు చేయాలని కోరడం జరిగింది. అలాగే సదుం మండలం జోగివారిపల్లి పంచాయతీ నాయనవాణిపల్లి నుండి దామలచెరువు అడవిలోకి రోడ్డు మార్గం కల్పించాలని డీఎఫ్వోకు వినవించడం జరిగింది. నెక్కొంది పంచాయతీ, ఇటికనెల్లూరు గ్రామంలో గతంలో నిర్మించిన డ్రైనేజీ కాలువ సమస్యపై,
చిన్న పిల్లలు ఆడుకుంటూ పడిపోతున్నారని, కాలువలో నీరు సరిగా ప్రవహించడం లేదని ఎండీవో దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్, స్టేట్ మోదీలియర్ డైరెక్టర్ మణికంఠ, పట్టణ ఉపాధ్యక్షుడు నందు, నాయకులు రవి, భార్గవ్, శీనా, గణపతి తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube