సోమవారం మదనపల్లిలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (PGRS)
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు
స్వయంగా పాల్గొనున్న జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్. అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను నేరుగా విని, వాటిని తక్షణమే పరిష్కరించేందుకు రేపు (సోమవారం, జనవరి 5) మదనపల్లిలోని డీఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్వయంగా ప్రజల వినతులను స్వీకరిస్తారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న బాధితులు, ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. తమ సమస్యలపై ఫిర్యాదు చేయాలనుకునే వారు సంబంధిత పత్రాలతో రేపు ఉదయం మదనపల్లిలోని డీఎస్పీ కార్యాలయానికి హాజరుకావాలని తెలిపారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube