BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ – యువనేతకు మరోసారి అవకాశం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jun, 2026 - 02:41 PM
105 వీక్షణలు

తెలుగుదేశం పార్టీ (టెదేపా) తమ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. పార్టీకే దగ్గర‌గా ఉండే విధంగా, సామాజిక సమతూకాన్ని పాటిస్తూ, యువ నాయకత్వానికి ప్రాధాన్యతనిచ్చి ఈ ఎంపికను చేయడం జరిగింది. అభ్యర్థులుగా ఎంపికైన వారు:

భాష్యం రామకృష్ణ – విద్యావేత్త, పార్టీ కష్టకాలంలో ఆర్థిక, వ్యూహాత్మకంగా మద్దతుగా నిలిచిన ప్రముఖుడు.

సానా సతీష్ – కాకినాడకు చెందిన, గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన నాయకుడు. కాపు సమాజానికి ప్రాతినిధ్యం కల్పిస్తూ మరోసారి అవకాశం.

చింతకాయల విజయ్ – యువ నేత, బీసి సమాజానికి ప్రాతినిధ్యం. తండ్రి అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం శాసనసభాపతి. గతంలో అనకాపల్లి లోక్‌సభ టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ పొత్తుల కారణంగా త్యాగం చేయాల్సి వచ్చింది.

మూడో స్థానంపై చివరి నిమిషం వరకు సీనియర్ నేత వర్ల రామయ్య కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, పార్టీ అధిష్ఠానం భవిష్యత్ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ విజయ్ వైపే మొగ్గు చూపింది.

రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో టీడీపీ మూడు, మిత్రపక్ష జనసేనకు ఒక స్థానం కేటాయించబడింది. జనసేన అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా అభ్యర్థులు సోమవారం నామినేషన్లు వేయనున్నారు. ప్రస్తుత శాసనసభలో కూటమికి ఉన్న మాజినిటీ ఆధారంగా, ఈ నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా, పోటీ లేకుండా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.