BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 02 June 2026, 05:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజ్యసభకు షర్మిల? కర్ణాటక నుంచి అవకాశం ఉన్నట్లు ప్రచారం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:25 PM
126 వీక్షణలు

రాజ్యసభకు షర్మిల? కర్ణాటక నుంచి అవకాశం ఉన్నట్లు ప్రచారం

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షర్మిల, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

అయితే పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహించాలని ఉన్న తన ఆకాంక్షను రాజ్యసభ ద్వారా నెరవేర్చుకునే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఆమెను రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

వైఎస్ కుటుంబంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లోక్‌సభ సభ్యులుగా ఎన్నికైన విషయం తెలిసిందే. షర్మిల రాజ్యసభకు ఎన్నికైతే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, కుమార్తె ఇద్దరూ పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించిన వారిగా నిలుస్తారు.

అయితే షర్మిల రాజ్యసభ ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు