రాజ్యసభకు షర్మిల? కర్ణాటక నుంచి అవకాశం ఉన్నట్లు ప్రచారం
రాజ్యసభకు షర్మిల? కర్ణాటక నుంచి అవకాశం ఉన్నట్లు ప్రచారం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షర్మిల, వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
అయితే పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించాలని ఉన్న తన ఆకాంక్షను రాజ్యసభ ద్వారా నెరవేర్చుకునే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఆమెను రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
వైఎస్ కుటుంబంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లోక్సభ సభ్యులుగా ఎన్నికైన విషయం తెలిసిందే. షర్మిల రాజ్యసభకు ఎన్నికైతే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, కుమార్తె ఇద్దరూ పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించిన వారిగా నిలుస్తారు.
అయితే షర్మిల రాజ్యసభ ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు