రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాలాభిషేకం నిర్వహించారు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాలాభిషేకం నిర్వహించారు
మంచిర్యాల నియోజకవర్గం..
తెలంగాణ ప్రభుత్వం తలసేమియా మరియు సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు ఆగస్టు 15వ తేదీ నుంచి నెలవారీ సామాజిక భద్రత పింఛన్లను అమలు చేయనున్న నేపథ్యంలో, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐబీ చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొని మాట్లాడుతూ, తలసేమియా మరియు సికిల్ సెల్ ఎనీమియా బాధితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మానవతా దృక్పథంతో కూడుకున్నదని అన్నారు. బాధిత కుటుంబాలకు ఈ పింఛన్ పథకం ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుందని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ అసోసియేషన్ సభ్యులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు పలువురు అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.