రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి గౌడ సంఘం విరాళం
రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి గౌడ సంఘం విరాళం
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి చిట్యాల గౌడ సంక్షేమ సంఘం ఆదివారం విరాళం అందజేశారు. తమ కులదైవమైన అమ్మవారి ఆలయం అత్యంత వైభవంగా రూపుదిద్దుకోవాలనే సంకల్పంతో సంఘం తరపున విరాళాన్ని అందజేశారు. వచ్చిన స్వచ్ఛంద దాతలు
ఆలయ నిర్మాణ ఖర్చుల నిమిత్తం ఇప్పటికే గౌడ కులస్థులు పలువురు వ్యక్తిగత స్థాయిలో తమ విరాళాలను ప్రకటించారు. దీనికి తోడు, సామాజిక బాధ్యతగా గౌడ సంక్షేమ సంఘం కూడా తన వంతు సహకారాన్ని అందిస్తూ ఆలయ నిర్వాహకులకు విరాళాన్ని సమర్పించింది. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు మారగోని రమేష్ గౌడ్, పెద్దలు పుల్లెంల కోటయ్య గౌడ్,ఉపాధ్యక్షులు పంతంగి వెంకన్న గౌడ్, ఉయ్యాల మల్లేష్ గౌడ్, మేకల సురేష్ గౌడ్, కార్యవర్గ సభ్యులు బొడ్డు శంకర్ గౌడ్, గీత కార్మికులు కాసుల రాములు గౌడ్, నాతి రమేష్ గౌడ్, పంతంగి శ్రీను గౌడ్ తదితరులు పాల్గొన్నారు