రైలు కిందపడి యువకుడి మృతి
రైలు కిందపడి యువకుడి మృతి
నిరుద్యోగం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఉన్నత చదువులు చదివినా, ఆశించిన కొలువు దక్కలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు రైలు కిందపడి ఈ హృదయవిదారక సంఘటన నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన కొండకింది హరీష్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు. చదువు పూర్తి చేసిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కన్నాడు. అయితే, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన స్థాయిలో ఉద్యోగం రాకపోవడంతో గత కొంతకాలంగా హరీష్ తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెందిన హరీష్ రెడ్డి, నార్కట్పల్లి శివారులో రైలు కిందపడి ప్రాణాలు విడిచినట్టు స్థానికులు తెలియజేశారు. కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
కళ్లముందే కొడుకు శవమై పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.