BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

రైలు కిందపడి యువకుడి మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
04 Apr, 2026 - 01:46 PM
710 వీక్షణలు

రైలు కిందపడి యువకుడి మృతి

నిరుద్యోగం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఉన్నత చదువులు చదివినా, ఆశించిన కొలువు దక్కలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు రైలు కిందపడి  ఈ హృదయవిదారక సంఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. ​చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన కొండకింది హరీష్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు. చదువు పూర్తి చేసిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కన్నాడు. అయితే, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన స్థాయిలో ఉద్యోగం రాకపోవడంతో గత కొంతకాలంగా హరీష్ తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ​ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెందిన హరీష్ రెడ్డి, నార్కట్‌పల్లి శివారులో రైలు కిందపడి ప్రాణాలు విడిచినట్టు స్థానికులు తెలియజేశారు. కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

​కళ్లముందే కొడుకు శవమై పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.