BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానా.. చెల్లించకపోతే జైలు శిక్ష..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 10:41 PM
73 వీక్షణలు

రైల్వే ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1989 రైల్వే చట్టంలో కీలక సవరణలు చేసింది. జన విశ్వాస్ చట్టం కింద తీసుకొచ్చిన ఈ మార్పులతో రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) అధికారాలకు మరింత బలం చేకూరింది.

కొత్త నిబంధనల ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణించడం, మహిళల కోచ్‌లో అనుమతి లేకుండా ప్రవేశించడం, రైళ్లలో ధూమపానం చేయడం వంటి ఉల్లంఘనలకు ఆర్పీఎఫ్ అధికారులు ఇకపై అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించనున్నారు. కాజీపేటలో ఈ మార్పులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

గతంలో జరిమానాల వసూళ్ల విషయంలో ఆర్పీఎఫ్ అధికారాలు పరిమితంగా ఉండగా, తాజా సవరణలతో ఈ నెల 15 నుంచి నేరుగా చర్యలు తీసుకునే అవకాశం కల్పించారు. విధించిన జరిమానాను చెల్లించకపోతే సంబంధిత వ్యక్తిని కోర్టులో హాజరుపరిచి జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది.

 రైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి.. లేదంటే భారీ ఫైన్‌తో పాటు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు.