BREAKING
ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్
www.ntodaynews.com

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానా.. చెల్లించకపోతే జైలు శిక్ష..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 10:41 PM
12 వీక్షణలు

రైల్వే ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1989 రైల్వే చట్టంలో కీలక సవరణలు చేసింది. జన విశ్వాస్ చట్టం కింద తీసుకొచ్చిన ఈ మార్పులతో రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) అధికారాలకు మరింత బలం చేకూరింది.

కొత్త నిబంధనల ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణించడం, మహిళల కోచ్‌లో అనుమతి లేకుండా ప్రవేశించడం, రైళ్లలో ధూమపానం చేయడం వంటి ఉల్లంఘనలకు ఆర్పీఎఫ్ అధికారులు ఇకపై అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించనున్నారు. కాజీపేటలో ఈ మార్పులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

గతంలో జరిమానాల వసూళ్ల విషయంలో ఆర్పీఎఫ్ అధికారాలు పరిమితంగా ఉండగా, తాజా సవరణలతో ఈ నెల 15 నుంచి నేరుగా చర్యలు తీసుకునే అవకాశం కల్పించారు. విధించిన జరిమానాను చెల్లించకపోతే సంబంధిత వ్యక్తిని కోర్టులో హాజరుపరిచి జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది.

 రైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి.. లేదంటే భారీ ఫైన్‌తో పాటు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు.