రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానా.. చెల్లించకపోతే జైలు శిక్ష..!
రైల్వే ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1989 రైల్వే చట్టంలో కీలక సవరణలు చేసింది. జన విశ్వాస్ చట్టం కింద తీసుకొచ్చిన ఈ మార్పులతో రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) అధికారాలకు మరింత బలం చేకూరింది.
కొత్త నిబంధనల ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణించడం, మహిళల కోచ్లో అనుమతి లేకుండా ప్రవేశించడం, రైళ్లలో ధూమపానం చేయడం వంటి ఉల్లంఘనలకు ఆర్పీఎఫ్ అధికారులు ఇకపై అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించనున్నారు. కాజీపేటలో ఈ మార్పులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పోస్టర్ను కూడా విడుదల చేశారు.
గతంలో జరిమానాల వసూళ్ల విషయంలో ఆర్పీఎఫ్ అధికారాలు పరిమితంగా ఉండగా, తాజా సవరణలతో ఈ నెల 15 నుంచి నేరుగా చర్యలు తీసుకునే అవకాశం కల్పించారు. విధించిన జరిమానాను చెల్లించకపోతే సంబంధిత వ్యక్తిని కోర్టులో హాజరుపరిచి జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది.
రైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి.. లేదంటే భారీ ఫైన్తో పాటు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు.