BREAKING
SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత. రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత. రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్
www.ntodaynews.com

రైతు భరోసా: నేడు రెండో విడత నిధులు జమ

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 03:38 PM
64 వీక్షణలు

రైతు భరోసా: నేడు రెండో విడత నిధులు జమ

తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం, యాసంగి పంటల సాగులో రైతులకు ఆర్థిక మద్దతు అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద నేడు రెండో విడత నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి.

ఈ పథకం కింద ప్రతి రైతుకు రెండు విడతల్లో సంవత్సరానికి రూ.12,000 అందించాలన్న లక్ష్యంతో రూ.6,000 చొప్పున ఏకరానికి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయబడతాయి. మొదటి విడత నిధులు ఇప్పటికే ప్రభుత్వం జమ చేసింది. ఈ సందర్భంగా మార్చి 22న సిద్ధిపేట జిల్లా నర్మెటలో జరిగిన బహిరంగ సభలో మొదటి విడత నిధులుగా రూ.3,590 కోట్లు 1.5 కోట్ల ఎకరాలకు రైతుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే.

నేడు, భూపాలపల్లి జిల్లా కాటారం వద్ద జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రెండో విడతగా 45,11,947 మంది రైతులకు రూ. 2,206 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. ఈ రెండో విడత నిధుల విడుదలతో రెండు విడతలలో మొత్తంగా రూ.5,653 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

రెండో విడతలో రెండు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు జమ కానున్నాయి. మూడో విడత నిధుల విడుదల ఈ నెలాఖరులో జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే, మూడో విడతలో మరో ఎకరాని, ఐదు ఎకరాల వరకు నిధులు అందిస్తారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేయడానికి ప్రతి సీజన్‌కు సుమారు రూ.9,000 కోట్ల అవసరం ఉంటుందట. ఇందుకు ప్రతీ సీజన్‌లో మొత్తంగా రూ.18,000 కోట్లు అందించాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వానికి ఈ మొత్తం సర్దుబాటు చేయడం చాలా కష్టం కావడం వల్ల, విడతల వారీగా నిధులు జమ చేస్తోంది.

రెండో విడత నిధులు అందుకోలేని రైతులు సంబంధిత వ్యవసాయ శాఖ లేదా రెవెన్యూ శాఖ అధికారులతో సంప్రదించి, అర్హత నిర్ధారించుకోవాలి. అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయి.

రెండో విడత పూర్తయిన వెంటనే, మూడో విడత నిధులను కూడా విడుదల చేయటానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు మూడో విడత నిధులు ఈ నెలాఖరులోపు జమ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.