రైతు భరోసా: నేడు రెండో విడత నిధులు జమ
రైతు భరోసా: నేడు రెండో విడత నిధులు జమ
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం, యాసంగి పంటల సాగులో రైతులకు ఆర్థిక మద్దతు అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద నేడు రెండో విడత నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి.
ఈ పథకం కింద ప్రతి రైతుకు రెండు విడతల్లో సంవత్సరానికి రూ.12,000 అందించాలన్న లక్ష్యంతో రూ.6,000 చొప్పున ఏకరానికి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయబడతాయి. మొదటి విడత నిధులు ఇప్పటికే ప్రభుత్వం జమ చేసింది. ఈ సందర్భంగా మార్చి 22న సిద్ధిపేట జిల్లా నర్మెటలో జరిగిన బహిరంగ సభలో మొదటి విడత నిధులుగా రూ.3,590 కోట్లు 1.5 కోట్ల ఎకరాలకు రైతుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే.
నేడు, భూపాలపల్లి జిల్లా కాటారం వద్ద జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రెండో విడతగా 45,11,947 మంది రైతులకు రూ. 2,206 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. ఈ రెండో విడత నిధుల విడుదలతో రెండు విడతలలో మొత్తంగా రూ.5,653 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
రెండో విడతలో రెండు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు జమ కానున్నాయి. మూడో విడత నిధుల విడుదల ఈ నెలాఖరులో జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే, మూడో విడతలో మరో ఎకరాని, ఐదు ఎకరాల వరకు నిధులు అందిస్తారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేయడానికి ప్రతి సీజన్కు సుమారు రూ.9,000 కోట్ల అవసరం ఉంటుందట. ఇందుకు ప్రతీ సీజన్లో మొత్తంగా రూ.18,000 కోట్లు అందించాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వానికి ఈ మొత్తం సర్దుబాటు చేయడం చాలా కష్టం కావడం వల్ల, విడతల వారీగా నిధులు జమ చేస్తోంది.
రెండో విడత నిధులు అందుకోలేని రైతులు సంబంధిత వ్యవసాయ శాఖ లేదా రెవెన్యూ శాఖ అధికారులతో సంప్రదించి, అర్హత నిర్ధారించుకోవాలి. అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయి.
రెండో విడత పూర్తయిన వెంటనే, మూడో విడత నిధులను కూడా విడుదల చేయటానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు మూడో విడత నిధులు ఈ నెలాఖరులోపు జమ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.