www.ntodaynews.com
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ
రేవంత్రెడ్డి హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన ‘రైతు భరోసా సదస్సు’లో రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద నిధులను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సుమారు 44.28 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లను జమ చేసినట్లు సీఎం ప్రకటించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న ఆయన, రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, రైతుల పెట్టుబడి భారం తగ్గించడం లక్ష్యంగా రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.