BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​రైతు గోస పట్టదా? కొనుగోలు కేంద్రాలు ఏవి?

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
29 Apr, 2026 - 04:33 PM
97 వీక్షణలు

​రైతు గోస పట్టదా? కొనుగోలు కేంద్రాలు ఏవి?: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు

మంచిర్యాల జిల్లాలో వరి మరియు మొక్కజొన్న రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలుదారులు కరువవ్వడంతో అన్నదాతలు రోడ్డున పడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా వరి, మొక్కజొన్న పంటలు కళ్ళాల్లోనే నిల్వ ఉండి పాడవుతున్నా, ప్రభుత్వం కనీసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో విఫలమైందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రైతులకు అండగా ఉంటామని ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారిని గాలికొదిలేసిందని విమర్శించారు. ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెబుతున్న అభివృద్ధి మాటలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో రైతుల దుస్థితి చూస్తుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమవుతుందని రఘునాథరావు పేర్కొన్నారు. తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను తెరిచి, మద్దతు ధరతో పంటను సేకరించాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు