BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

​రైతు గోస పట్టదా? కొనుగోలు కేంద్రాలు ఏవి?

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
29 Apr, 2026 - 04:33 PM
40 వీక్షణలు

​రైతు గోస పట్టదా? కొనుగోలు కేంద్రాలు ఏవి?: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు

మంచిర్యాల జిల్లాలో వరి మరియు మొక్కజొన్న రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలుదారులు కరువవ్వడంతో అన్నదాతలు రోడ్డున పడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా వరి, మొక్కజొన్న పంటలు కళ్ళాల్లోనే నిల్వ ఉండి పాడవుతున్నా, ప్రభుత్వం కనీసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో విఫలమైందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రైతులకు అండగా ఉంటామని ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారిని గాలికొదిలేసిందని విమర్శించారు. ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెబుతున్న అభివృద్ధి మాటలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో రైతుల దుస్థితి చూస్తుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమవుతుందని రఘునాథరావు పేర్కొన్నారు. తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను తెరిచి, మద్దతు ధరతో పంటను సేకరించాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు