BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

​రైతు గోస పట్టదా? కొనుగోలు కేంద్రాలు ఏవి?

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
29 Apr, 2026 - 04:33 PM
17 వీక్షణలు

​రైతు గోస పట్టదా? కొనుగోలు కేంద్రాలు ఏవి?: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు

మంచిర్యాల జిల్లాలో వరి మరియు మొక్కజొన్న రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలుదారులు కరువవ్వడంతో అన్నదాతలు రోడ్డున పడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా వరి, మొక్కజొన్న పంటలు కళ్ళాల్లోనే నిల్వ ఉండి పాడవుతున్నా, ప్రభుత్వం కనీసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో విఫలమైందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రైతులకు అండగా ఉంటామని ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారిని గాలికొదిలేసిందని విమర్శించారు. ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెబుతున్న అభివృద్ధి మాటలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో రైతుల దుస్థితి చూస్తుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమవుతుందని రఘునాథరావు పేర్కొన్నారు. తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను తెరిచి, మద్దతు ధరతో పంటను సేకరించాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు