www.ntodaynews.com
రైతుబంధు తెచ్చిన మహోన్నత వ్యక్తి కేసీఆర్..
తెలంగాణ
/
తెలంగాణ
మంచిర్యాల జిల్లా :- లక్సెట్టిపేటలో బుధవారం జరిగిన సమావేశంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన 'రైతుబంధు' పథకం ద్వారానే రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయని, ఆయనొక మహోన్నత వ్యక్తి అని కొనియాడిన ఆయన, కేవలం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రైతుల నోట్లో మట్టి కొడుతూ వారిని ఘోరంగా వంచిస్తోందని ఘాటుగా విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరి వీడి తక్షణమే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు