BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

రెడ్డిగూడెంలో విజయవంతంగా TB ముక్త భారత్ ఉచిత వైద్య శిబిరం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 02:40 PM
109 వీక్షణలు

రెడ్డిగూడెంలో విజయవంతంగా “TB ముక్త భారత్” ఉచిత వైద్య శిబిరం

ప్రజలతో మమేకమైన ప్రజల సేవకుడు ముప్పిడి నాగేశ్వర రెడ్డి

ప్రజల ఆరోగ్య రక్షణే ప్రధాన లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న “TB ముక్త భారత్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా రెడ్డిగూడెం హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య పరీక్షల శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

ఈ కార్యక్రమంలో ప్రజల సేవకుడు ముప్పిడి నాగేశ్వర రెడ్డి పాల్గొని గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. “వ్యాధి వచ్చిన తర్వాత చికిత్సకంటే ముందుగానే పరీక్షలు చేయించుకోవడం ఎంతో మేలు చేస్తుంది” అని సూచిస్తూ TB ముక్త భారత్ కార్యక్రమం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శిబిరానికి వచ్చిన ప్రజల కోసం ప్రత్యేకంగా మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆకట్టుకుంది. మహిళలు, వృద్ధులు, రైతులు, యువతతో నాగేశ్వర రెడ్డి మమేకమై వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అదేవిధంగా శిబిరంలో ఏర్పాటు చేసిన TB పరీక్షల విభాగం, డిజిటల్ ఎక్స్‌రే కేంద్రాన్ని సందర్శించి వైద్య పరీక్షల నిర్వహణను స్వయంగా పరిశీలించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

ఈ వైద్య శిబిరంలో TB పరీక్షలతో పాటు BP, షుగర్, హీమోగ్లోబిన్ తదితర ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సేవలను వినియోగించుకున్నారు.

“ఆరోగ్యమే మహాభాగ్యం… ముందస్తు పరీక్షలే సంపూర్ణ రక్షణ” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించిందని పలువురు అభిప్రాయపడ్డారు.