BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

రెండు ఫోటోల విధానంతో ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు: వి నాగరాజు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 May, 2026 - 10:55 PM
136 వీక్షణలు

ఉపాధి హామీ పథకం ద్వారా జీవనం సాగిస్తున్న కూలీలకు ఉపాధి దూరం చేయొద్దని, రెండు ఫోటోల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు విస్సంపల్లి నాగరాజు డిమాండ్ చేశారు. విస్సన్నపేట మండలం కలగర గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ యాప్, గ్రూప్ ఫోటో, రెండు ఫోటోల విధానం కారణంగా ఉపాధి హామీ కూలీలు పనులకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

గత రెండు సంవత్సరాలుగా ఆంక్షల పేరుతో ఫేస్ యాప్ ద్వారా ఫోటోలు తీసే విధానం అమలు చేస్తున్న కారణంగా ఇప్పటికే సగానికి పైగా కూలీలు పనులకు దూరమయ్యారని తెలిపారు. ఫోటో నమోదు కోసం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు వేచి చూడాల్సి వస్తోందని, దీంతో కూలీల పనిదినాలు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ రెండు ఫోటోల విధానాన్ని రద్దు చేసి, ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పని అవకాశాలు కల్పించాలని నాగరాజు కోరారు.

ఈ కార్యక్రమంలో విజయ్, సుబ్బారావు, లక్ష్మి తదితర ఉపాధి కూలీలు పాల్గొన్నారు.