BREAKING
292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి
www.ntodaynews.com

రెండు ఫోటోల విధానంతో ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు: వి నాగరాజు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 May, 2026 - 10:55 PM
100 వీక్షణలు

ఉపాధి హామీ పథకం ద్వారా జీవనం సాగిస్తున్న కూలీలకు ఉపాధి దూరం చేయొద్దని, రెండు ఫోటోల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు విస్సంపల్లి నాగరాజు డిమాండ్ చేశారు. విస్సన్నపేట మండలం కలగర గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ యాప్, గ్రూప్ ఫోటో, రెండు ఫోటోల విధానం కారణంగా ఉపాధి హామీ కూలీలు పనులకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

గత రెండు సంవత్సరాలుగా ఆంక్షల పేరుతో ఫేస్ యాప్ ద్వారా ఫోటోలు తీసే విధానం అమలు చేస్తున్న కారణంగా ఇప్పటికే సగానికి పైగా కూలీలు పనులకు దూరమయ్యారని తెలిపారు. ఫోటో నమోదు కోసం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు వేచి చూడాల్సి వస్తోందని, దీంతో కూలీల పనిదినాలు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ రెండు ఫోటోల విధానాన్ని రద్దు చేసి, ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పని అవకాశాలు కల్పించాలని నాగరాజు కోరారు.

ఈ కార్యక్రమంలో విజయ్, సుబ్బారావు, లక్ష్మి తదితర ఉపాధి కూలీలు పాల్గొన్నారు.