BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

గంజాయి నిరోధానికి ఆకస్మిక తనిఖీలు

తెలంగాణ
22 Feb, 2026 - 10:40 AM
101 వీక్షణలు
ఆత్మకూరులో గంజాయి నిరోధానికి ఆకస్మిక తనిఖీలు బస్టాండ్‌లో అనుమానితుల తనిఖీ – అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున నంద్యాల జిల్లా, ఆత్మకూరు: పట్టణంలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల సరఫరాను అరికట్టేందుకు ఆత్మకూరు పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక బస్టాండ్‌లో గంజాయి సరఫరా జరుగుతోందన్న సమాచారంతో అర్బన్ సీఐ మహేశ్వర్ రెడ్డి, ఎస్సై డి.వి. నారాయణరెడ్డి సిబ్బందితో కలిసి అనుమానితులను తనిఖీ చేశారు. అవగాహన కార్యక్రమం తనిఖీల అనంతరం ఆటో డ్రైవర్లతో పోలీసులు సమావేశమై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ  మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని, మహిళలు, మైనర్ బాలికల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాచారమిస్తే చర్యలు గంజాయి లేదా ఇతర డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్న సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని ఆటో డ్రైవర్లకు సూచించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ పట్టణంలో దొంగతనాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. #Atmakur #NandyalDistrict #DrugPrevention #PoliceAwareness Follow us on Website Facebook Instagram YouTube