రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం
రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం : అడిషనల్ ఎస్పీ రమేష్ NTODAY NEWS చిట్యాల
ప్రభుత్వ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చిట్యాల పట్టణంలో నిర్వహించిన 'అరైవ్ అలైవ్ పోలీస్ మరియు రవాణా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ రమేష్, డిప్యూటీ కమిషనర్ డా. వాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు నిబంధనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకంగా మారుతోందని అన్నారు. కొన్నేళ్లుగా జాతీయ రహదారి పై జరిగిన ప్రమాదాల గణాంకాలను వివరిస్తూ.. అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి కారణాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు వాహన ఫిట్నెస్ మరియు సరైన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. హెల్మెట్ మరియు సీట్బెల్ట్ ధరించడం వల్ల ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు మరియు పాదచారుల భద్రత విషయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమానికి రోడ్డు రవాణా శాఖ సీఐ అంజయ్య గారు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహాలక్ష్మయ్య నార్కెట్పల్లి సీఐ గ చిట్యాల తహసీల్దార్ , మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, వైస్ చైర్మన్, గుండెబోయిన శ్రీలక్ష్మి, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు మరియు పట్టణ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.