www.ntodaynews.com
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
తెలంగాణ
/
మంచిర్యాల
పెద్దపల్లి జిల్లా బసంతనగర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన ఎడ్ల శ్రీనివాస్, రజిత దంపతులు మృతి చెందారు.
హైదరాబాద్లో చదువుకుంటున్న తమ కుమార్తె రిషిత వద్దకు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా, కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది