BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ
26 Jan, 2026 - 06:21 AM
93 వీక్షణలు
పాషిగామ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్  -ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ -పాఠశాల అభివృద్ధిపై గ్రామస్తుల ప్రశంసలు వెల్గటూర్ మండలం పాషిగామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నీలం సంపత్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం స్వీకరించారు. నూతన పాలకవర్గానికి సన్మానం గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కాండ్రపు శిరీష, ఉపసర్పంచ్ కొత్తూరి భూమయ్య మరియు వార్డు సభ్యులను పాఠశాల తరఫున ఘనంగా సన్మానించారు. త్వరలో నూతన భవన నిర్మాణం ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ, గతంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాఠశాలను సందర్శించి విద్యా విధానాన్ని అభినందించడం గర్వకారణమని తెలిపారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో త్వరలోనే పాఠశాలకు నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. సంపత్ కుమార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని గ్రామస్తులు ప్రశంసలు వ్యక్తం చేశారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గేయాలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్పంచ్, ఉపసర్పంచ్ చేతుల మీదుగా బహుమతులు, 2026 నూతన క్యాలెండర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాండ్రపు శిరీష, ఉపసర్పంచ్ కొత్తూరి భూమయ్య, మాజీ సర్పంచ్ బొప్పూ తిరుపతి, నూతన వార్డు సభ్యులు, గ్రామ యువకులు, పాఠశాల సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #RepublicDayCelebrations #GovernmentSchool #PasigamSchool #PrimaryEducation #NationalFlagHoisting #SchoolDevelopment #Velgatur #JagtialDistrict Follow us on Website Facebook Instagram YouTube