BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ
26 Jan, 2026 - 06:21 AM
59 వీక్షణలు
పాషిగామ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్  -ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ -పాఠశాల అభివృద్ధిపై గ్రామస్తుల ప్రశంసలు వెల్గటూర్ మండలం పాషిగామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నీలం సంపత్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం స్వీకరించారు. నూతన పాలకవర్గానికి సన్మానం గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కాండ్రపు శిరీష, ఉపసర్పంచ్ కొత్తూరి భూమయ్య మరియు వార్డు సభ్యులను పాఠశాల తరఫున ఘనంగా సన్మానించారు. త్వరలో నూతన భవన నిర్మాణం ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ, గతంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాఠశాలను సందర్శించి విద్యా విధానాన్ని అభినందించడం గర్వకారణమని తెలిపారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో త్వరలోనే పాఠశాలకు నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. సంపత్ కుమార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని గ్రామస్తులు ప్రశంసలు వ్యక్తం చేశారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గేయాలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్పంచ్, ఉపసర్పంచ్ చేతుల మీదుగా బహుమతులు, 2026 నూతన క్యాలెండర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాండ్రపు శిరీష, ఉపసర్పంచ్ కొత్తూరి భూమయ్య, మాజీ సర్పంచ్ బొప్పూ తిరుపతి, నూతన వార్డు సభ్యులు, గ్రామ యువకులు, పాఠశాల సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #RepublicDayCelebrations #GovernmentSchool #PasigamSchool #PrimaryEducation #NationalFlagHoisting #SchoolDevelopment #Velgatur #JagtialDistrict Follow us on Website Facebook Instagram YouTube