www.ntodaynews.com
పాషిగామ పాఠశాలలో RO ప్లాంట్ ప్రారంభం
తెలంగాణ
పాషిగామ పాఠశాలలో RO ప్లాంట్ ప్రారంభం – విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
వెల్గటూర్ మండలం పాషిగామ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని RO (రివర్స్ ఆస్మోసిస్) వాటర్ ప్యూరిఫైర్ను ఏర్పాటు చేశారు. సుమారు రూ.12 వేల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ను మండల విద్యాధికారి ప్రభాకర్ ప్రారంభించారు.
పాషిగామ గ్రామ దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ సదుపాయాన్ని కల్పించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బరుపటి జనార్ధన్, గోపతీ నరేష్, కాండ్రపు మహేష్, ఉప సర్పంచ్ భూమయ్య, అజయ్, రాజు తదితరులు తమ వంతు సహకారం అందించారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ, స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా విద్యార్థులను నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి రక్షించవచ్చని తెలిపారు. దాతల సామాజిక బాధ్యతను ప్రశంసించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నీలం సంపత్ కుమార్ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా ఈ చొరవను అభినందించారు.
కార్యక్రమంలో అల్లం సాయి, కంటేం అంజి, కంటేం రాజు, కంటేం సతయ్య, ఉపారపు సతీష్, నలిమేలా సురేష్, కొట్టె రవి, బరుపటి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
#Velgatoor #Pashigam #ROPlant #CleanDrinkingWater #SchoolDevelopment #CommunitySupport #TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube