BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

సాంబశివ ఆలయానికి రూ.20 లక్షలు మంజూరు

తెలంగాణ
16 Feb, 2026 - 09:44 AM
342 వీక్షణలు
బుగ్గారం సాంబశివ ఆలయానికి రూ.20 లక్షలు మంజూరు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: బుగ్గారం, (గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్) మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుగ్గారం మండల కేంద్రంలోని చారిత్రక సాంబశివ ఆలయాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ మండప నిర్మాణానికి నిధులు: ఆలయ ప్రాంగణంలో నూతన కళ్యాణ మండప నిర్మాణం కోసం రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అభివృద్ధిపై హామీ: బుగ్గారం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. దేవాలయ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు: ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాధినేని రాజేందర్, ఆలయ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు.     #Buggaaram #SambasivaTemple #TempleDevelopment #AdluriLaxmanKumar #TelanganaNews #CivicDevelopment Follow us on Website Facebook Instagram YouTube