సామాజిక మధ్యమాలకు అలవాటు పడకుండా భవిష్యత్తుకు కావలసిన నైపుణ్యాన్ని పెంచుకోవాలి
సామాజిక మధ్యమాలకు అలవాటు పడకుండా భవిష్యత్తుకు కావలసిన నైపుణ్యాన్ని పెంచుకోవాలి--జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు
బాలల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తదనుగుణంగా పిల్లలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.బుధవారం రోజున ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా దత్తత సహాయ వాణీ (చైల్డ్ సేఫ్టీ.. సే టు నో డ్రగ్స్) బొమ్మలరామారం కేజీబీవీ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బాలికలు సామాజిక మాధ్యమాలకు అలవాటు పడకుండా వారి భవిష్యత్తు కు కావలసిన నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. తద్వారా జీవితంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని తెలిపారు. బాలికలు 18 సంవత్సరాలు నిండే వరకు కేవలం చదువు పైన మాత్రమే శ్రద్ధ ఉండాలని సూచించారు. విద్యార్థుల హక్కులు,రక్షణ చట్టాలు మరియు బాలలపై జరిగే అన్యాయాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహ రావు,డీఎస్పీ మనోహర్,బిఆర్ బి కో- ఆర్డినేటర్ అనంత లక్ష్మీ, సిడిపిఓ శైలజ, తహసీల్దార్ పి. శ్రీనివాసరావు, ఎంపీడీవో శ్యామల, ఎస్ఐ బుగ్గ శ్రీశైలం, గ్రామ సర్పంచ్ దొమ్మాట రమాదేవి శంకర్, ఉప సర్పంచ్ మైలారం సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి రాంబాబు, కేజీబీవీ ఎస్ఓ రమాదేవి, జిల్లా మహిళా సాధికారత టీం డీసీపీయూ,చైల్డ్ లైన్ సిబ్బంది, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.